మథుర: ఉత్తరప్రదేశ్లోని పవిత్ర పట్టణమైన మథురలో రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ సోమవారం పర్యటించారు. బృందావన్లోని మహిళా ఆశ్రయ్ సదన్తోపాటు బాంకే బిహారీ ఆలయాన్ని కూడా సందర్శించారు. కాగా, ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో అక్కడి అధికారులు రాష్ట్రపతి భద్రత కోసం కొండెంగలను మోహరించారు. ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది.
మహిళా ఆశ్రయ్ సదన్తోపాటు బాంకే బిహారీ ఆలయ పరిసరాల్లో కోతుల బెడద ఎక్కువ. అక్కడికి వచ్చే వారి చేతుల్లో ఏ వస్తువులున్నా లాగేసుకుంటాయి. వీటితో రాష్ట్రపతి పర్యటనకు ఇబ్బంది కలుగొద్దనే ఉద్దేశంతో అధికారులు కొండెంగలను ఆశ్రయించాల్సి వచ్చింది. శిక్షణ పొందిన కొండెంగలను తీసుకొచ్చి అక్కడ కాపలా ఉంచారు. వీటిని ట్రైనర్ రామ్నివాస్ తీసుకొచ్చారు. వీటిని నియంత్రణ బాధ్యతను అటవీ శాఖకు చెందిన ప్రొఫెషనల్ ట్రైనర్లకు అప్పగించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ పర్యటన ముగిసేంతవరకూ ఇవి సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహించాయి.