పూంఛ్ సెక్టార్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి వున్న అడవుల్లో కార్చిచ్చు రగిలింది. దీంతో ఎల్ఓసీ దగ్గరి ప్రాంతాల్లో భారీగా ల్యాండ్ మైన్లు పేలాయి. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు. కొన్ని రోజులుగా ఎల్ఓసీ దగ్గరి అడవుల్లో కార్చిచ్చు రగులుతోంది. దీనిని ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 12 ల్యాండ్ మైన్లు పేలాయని అధికారులు వెల్లడించారు. అక్రమ చొరబాట్లను అరికట్టడానికే వీటిని అమర్చారని సమాచారం.
నియంత్రణ రేఖ వెంబడి ఉన్న అడవుల్లో మూడు రోజులుగా కార్చిచ్చు రగులుతూనే వుంది. ఈ కార్చిచ్చును ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. చాలా వరకు అదుపులోకి వచ్చాయి. కానీ.. బుధవారం సాయంత్రం ధర్మశాల బ్లాక్ వైపు ఈ కార్చిచ్చు మంటలు వ్యాపించాయి. బలమైన గాలుల కారణంగానే ఈ కార్చిచ్చు వ్యాపించింది. అని అటవీ అధికారులు వెల్లడించారు.