పట్నా : ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు ఊరట లభించింది. 2015 ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో లాలూ నిర్ధోషిగా బయటపడ్డారు. 2015లో లాలూ తన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ తరపున రాఘవాపూర్లో ప్రచారం చేస్తూ అసెంబ్లీ ఎన్నికలను వెనుకబడిన కులాలు, అగ్ర కులాల మధ్య యుద్ధంగా అభివర్ణించారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించేందుకు యాదవ్లు, ఇతర వెనుకబడిన కులాల వారు లౌకిక కూటమికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపు ఇచ్చారు. లాలూ ప్రసాద్ కులాల మధ్య చిచ్చు రేపే వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఎన్నికల చట్టాలను లాలూ ఉల్లంఘించారని ఈసీ గుర్తించింది.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఈసీ ఆర్జేడీ నేతకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఆధారాలు లేవని పేర్కొంటూ లాలూ యాదవ్ను నిర్ధోషిగా తేల్చారు.