Lalu Family Disputes | ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ఆయన పెద్ద కొడుకు తేజ్ప్రతాప్ యాదవ్ సొంతంగా విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జేడీని బలోపేతం చేయడానికే దీన్ని స్థాపించానని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం చాత్ర జన్శక్తి పరిషత్ అనే పేరుతో విద్యార్థి సంఘాన్ని స్థాపించారు.
కానీ ఆర్జేడీ అనుబంధ ఛాత్ర విద్యార్థి సంఘానికి ఏమాత్రం ప్రత్యర్థి కాదని సెలవిచ్చారు. గ్రామ స్థాయి నుంచి యువతను మొబిలైజ్ చేయడానికి కృషి చేస్తుందన్నారు. తనకు ఎల్లవేళలా లాలూ ప్రసాద్ దీవెనలు ఉన్నాయని తేజ్ ప్రతాప్ యాదవ్ చెప్పుకున్నారు.
తన సోదరుడు తేజస్వి యాదవ్కు అత్యంత సన్నిహితుడు, ఆర్జేడీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జగదానంద సింగ్తో ఘర్షణ పడ్డారు. ఆర్జేడీ చాత్ర రాష్ట్ర అధ్యక్షుడిగా ఆకాశ్ యాదవ్ను తొలగించడం తేజ్ ప్రతాప్ యాదవ్ను మనస్థాపానికి గురి చేసినట్లు తెలుస్తున్నది. తేజ్ ప్రతాప్ యాదవ్కు ఉన్న కొద్ది మంది స్నేహితుల్లో ఆకాశ్ యాదవ్ ఒకరు.
ఆకాశ్ యాదవ్ను తొలగించే విషయమై జగదానంద సింగ్.. తేజస్వి యాదవ్ను తప్పుదోవ పట్టించారని తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. ఆర్జేడీ ఆఫీసులో తాను అడుగుపెట్టబోనని.. జగదానంద సింగ్ ఒక హిట్లర్ అని మండి పడ్డారు. ఇదిలా ఉంటే, తేజ్ ప్రతాప్ యాదవ్.. లోక్జనశక్తి పార్టీలో చేరిపోవడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Back pain | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Mirnalini Ravi | అందాలతో అదరగొడుతున్న మృణాళిని రవి
హెల్త్ ఇన్సూరెన్స్ క్లైయిమ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి ? ఎవరిని సంప్రదించాలి
గుడ్డి నిర్ణయాలొద్దు.. నీట్ను వాయిదా వేయండి..!