పాట్నా : దాణా కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్ వారం రోజులు వాయిదా పడింది. దుమ్కా ట్రెజరీ కేసులో బెయిల్ పిటిషన్ విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేస్తూ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ శుక్రవారం తీర్పును వెలువరించారు. విచారణ సందర్భంగా లాలు తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. తన పార్టీని రాజకీయ కారణాల వల్ల జైలులో ఉంచాలని కోరుకుంటున్నందున సీబీఐ ఉద్దేశపూర్వకంగా ఈ విషయంలో ఆలస్యం చేస్తోందని వాదించారు.
దుమ్కా ట్రెజరీ నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లు విత్డ్రా చేయడంపై కేసు నమోదు అయింది. దాణా కుంభకోణానికి సంబంధించి మరో మూడు కేసుల్లో లాలు ఇప్పటికే బెయిల్ విజ్ఞాపణలు పెట్టుకున్నారు. లాలు ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు.