న్యూఢిల్లీ: లఢక్, కార్గిల్ ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీలు, పౌరసంఘాలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. వచ్చే నెల 1న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నది. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన జమ్ముకశ్మీర్కు చెందిన 14 రాజకీయ పార్టీలతో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. నియోజక వర్గాల పునర్విభజన, ఎన్నికలు, జమ్ముకశ్మీర్కు రాష్ట్రహోదా అంశాలపై ఆ రోజు చర్చించారు. లఢక్ను గిరిజన ప్రాంతంగా గుర్తించాలని లఢక్ ఎంపీ జమయంగ్ సెరింగ్ నంగ్యాల్ గతంలో కేంద్రాన్ని కోరారు. ఈ అంశం సమావేశంలో చర్చకు రానుంది.