ఢిల్లీ : కేంద్రీయ విద్యాలయ సంగథన్ (కేవీఎస్) జూన్ 23 న ఫస్ట్ క్లాస్ ప్రవేశానికి మొదటి తాత్కాలిక జాబితాను విడుదల చేయనుంది. వాస్తవానికి ఈ జాబితా ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా కొవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కాగా రెండవ జాబితా జూన్ 30 న అదేవిధంగా మూడవ జాబితా జూలై 5 న విడుదల కానున్నట్లు కేవీఎస్ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అన్రిజర్వ్డ్ సీట్ల భర్తీ జులై 2 నుండి జులై 6 వరకు చేపట్టనున్నారు. రెండవ తరగతి ప్రవేశానికి సవరించిన షెడ్యూల్ను కూడా కేవీఎస్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ 25 నుండి 30వ తేదీ వరకు విడుదల చేయనుంది.
కేంద్రీయ విద్యాలయాలలో ప్రవేశ ప్రక్రియ కోసం ఈ క్రింది పత్రాలు అవసరం అవుతాయి.