శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్ కుల్గామ్లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పాట్ అఖిరన్ మీర్ బజార్ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. ఉగ్రవాదుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం.. అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారని, ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతున్నది. మంచు లింగాన్ని దర్శించుకునేందుకు మొదటి బ్యాచ్ జమ్మూ నుంచి బయలుదేరింది. యాత్ర నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.