హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) డిప్యూటీ ప్రెసిడెంట్గా కె.రాజప్రసాద్రెడ్డి (అడ్వైర్టెజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ -సాక్షి) ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ 82వ వార్షిక సాధారణ సమావేశం శుక్రవారం వర్చువల్ మాధ్యమంలో నిర్వహించారు. ఎకనమిక్ టైమ్స్కు చెందిన మోహిత్ జైన్ అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, ఆజ్ సమాజ్కు చెందిన రాకేశ్ శర్మ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనట్టు ఐఎన్ఎస్ ఒక ప్రకటనలో వెల్లడించింది.