Krystyna Pyszková | ముంబై, మార్చి 9: ప్రపంచ సుందరి కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ అందగత్తె క్రిస్టినా పిస్కోవా(24) దక్కించుకున్నారు. భారత్కు చెందిన సిని శెట్టి గ్రాండ్ ఫినాలేలో నిష్క్రమించారు. ముంబై బీకేసీలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి వైభవంగా జరిగిన 71వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే పోటీలో పిస్కోవా అంతిమ విజేతగా నిలిచారు.
ఆమెకు 70వ మిస్ వరల్డ్ కరోలినా బైలావ్స్కా కిరీటాన్ని అలంకరించారు. లెబనాన్కు చెందిన లెస్మినా జైటౌన్ మొదటి రన్నరప్గా నిలిచారు. లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో డిగ్రీలు చేసిన క్రిస్టినా మోడల్గా పనిచేస్తున్నారు. ఓ సేవా సంస్థ స్థాపించి అందులో పనిచేస్తున్నారు.