న్యూఢిల్లీ : బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న పఠాన్ మూవీ వసూళ్లలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. పఠాన్ రూ. 1000 కోట్ల గ్రాస్ మార్క్ను టచ్ చేసే దిశగా దూసుకెళుతోంది. వసూళ్లతో దుమ్మురేపడమే కాకుండా ఈ మూవీలో సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. షారుక్ ఖాన్, దీపికా పదుకునేలపై చిత్రీకరించిన హుషారైన పాటలకు డ్యాన్స్ వీడియోలతో ఇంటర్నెట్ను నెటిజన్లు, షారుక్ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు.
తాజాగా పఠాన్ పీవర్ దక్షిణ కొరియానూ తాకింది. ఈ దేశానికి చెందిన డయాన్స్ గ్రూప్ ఝూమే జో పఠాన్కు తమదైన డ్యాన్స్ మూమెంట్స్తో ఇన్స్టాగ్రాం రీల్ను షేర్ చేశారు. ఈ వీడియోలో పలువురు కొరియన్ యువతులు, ఓ వ్యక్తి ఈ పాటలోని హుక్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటినుంచి ఇప్పటివరక 1.94 లక్షల మంది వీక్షించారు.
ఈ వీడియోపై దేశీ ఇన్స్టాగ్రాం యూజర్లు ప్రశంసలు గుప్పించారు. షారుక్ హిట్ సాంగ్కు క్రేజీ స్టెప్స్తో లవ్లీ మూమెంట్స్ ఇచ్చారని కొరియన్ డ్యాన్స్ గ్రూప్ను మెచ్చుకున్నారు. షారుక్ ఖాన్ పఠాన్ మూవీతో మరోసారి గ్లోబల్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారని మరికొందరు కామెంట్ చేశారు. ఝూమే జో పఠాన్ సాంగ్ను అర్జిత్ సింగ్, సుక్రితి కకర్, విశాల్ శేఖర్ ఆలపించారు. ఈ పాటకు యూట్యూబ్లో ఇప్పటివరకూ 24.5 కోట్ల వ్యూస్ లభించాయి.