మాజీ ఐపీఎస్ అధికారిణి, పాండిచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సోషల్ మీడియాలో బుక్ అయ్యారు. పొరపాటున ఓ వీడియోను అప్లోడ్ చేసి, అందరి ముందు నవ్వుల పాలయ్యారు. ఆమె షేర్ చేసిన వీడియోలో ఏముందంటే.. ఓ షార్క్ చేప నీళ్లలోంచి ఒక్కసారిగా ఎగిరి… హెలికాప్టర్ను నోటితో పట్టుకుంటుంది. దీంతో ఆ నీళ్లల్లో వున్న వారు హతాశులై చూస్తూ వుండిపోయారు.
ఆ షార్క్ చేప తన నోటితో హెలికాప్టర్ను పట్టుకోవడంతో ఆ హెలికాప్టర్ క్రాష్ అయి, నీటిలో పడిపోతుంది. అయితే ఈ వీడియోపై నేషనల్ జాగ్రఫిక్ ఛానల్ కొన్ని మిలియన్ డాలర్లు పెట్టి రైట్స్ కొనుక్కున్నారని వీడియోలో వుంది. ఈ రాతనే చూసి, కిరణ్ బేడీ పప్పులో కాలేశారు. నిజానికి ఈ వీడియో 5 హెడెడ్ షార్క్ అటాక్ అన్న సినిమాలోనిది. ఇవేవీ తెలుసుకోకుండా కిరణ్ బేడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నవ్వుల పాలయ్యారు.
ఇక.. కొందరు సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ కామెంట్లు చేశారు. కిరణ్ బేడీ అకౌంట్ హ్యాక్ అయ్యిందని భావిస్తున్నామని కామెంట్ చేశారు.
ధన్యవాదాలు మేడమ్.. చాలా మంది సివిల్స్ అభ్యర్థులకు మీరు స్ఫూర్తి. మీ తెలివి తేటలను చూస్తుంటే.. మీకే సివిల్స్ వచ్చినప్పుడు, వారికి ఎందుకు రాదు అన్న ధైర్యం వచ్చేస్తుంది అంటూ ట్వీట్ చేశారు.
ఇంత చదువుకున్న ఐపీఎస్ అధికారిణి కూడా… చివరకు వాట్సాప్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ బ్యాచ్లో చేరారని తెలుస్తోంది.
Watch this 🥹🥺🙄😳😲 pic.twitter.com/Io0PQb567U
— Kiran Bedi (@thekiranbedi) May 11, 2022