గువాహటి: అస్సాంలో తయారయ్యే ఓ ప్రత్యేక రకానికి చెందిన టీ పొడి వేలంలో రికార్డు స్థాయిలో రూ.99,999 ధర పలికింది. ‘మనోహరి గోల్డ్’ రకానికి చెందిన ఈ టీ పొడిని సౌరభ్ టీ ట్రేడర్స్ సంస్థ దక్కించుకున్నట్టు గువాహటి టీ వేలం కేంద్రం కార్యదర్శి ప్రియానుజ్ దత్త వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన వేలంలో ఏ టీ పొడికి ఇంత ధర ఎప్పుడూ పలుకలేదని తెలిపారు. అత్యద్భుతమైన నాణ్యత కలిగిన టీని కోరుకునే వీరాభిమానుల కోసం దీనిని ఉత్పత్తి చేస్తున్నట్టు మనోహరి టీ ఎస్టేట్ యజమాని రాజన్ లోహియా పేర్కొన్నారు. ఈ టీ తాగిన తర్వాత నాలుక మీద చాలాసేపు కమ్మటి రుచి అలా ఉండిపోతుందని, ఈ టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని అన్నారు.