బెగుసరాయ్, జూన్ 15: బీహార్లో మరో ‘పకద్వా వివాహ్’ ఘటన చోటుచేసుకున్నది. ఒక వెటర్నరీ డాక్టర్ను కిడ్నాప్ చేసి, అతనికి ఇష్టం లేకుండా ఓ అమ్మాయితో బలవంతంగా పెండ్లి చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకున్నది. తమ పశువు అనారోగ్యంగా ఉందని ముగ్గురు వ్యక్తులు వెటర్నరీ డాక్టర్కు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. వారు చెప్పిన దగ్గరకు వెళ్లిన ఆ వైద్యుడ్ని కిడ్నాప్ చేసి, అనంతరం భయపెట్టి ఓ అమ్మాయితో బలవంతంగా వివాహం చేశారు. దీనిపై బాధిత వ్యక్తి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థికంగా, ఉద్యోగ పరంగా మెరుగైన స్థితిలో ఉన్నవారిని టార్గెట్ చేసుకొని, వారిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెండ్లి చేసే ఘటనను పకద్వా వివాహ్గా పేర్కొంటారు.