లక్నో: ఉత్తరప్రదేశ్లోని షామ్లీ (Shamli) మున్సిపల్ కౌన్సిల్ (Municipal Council) సమావేశం రసాభాసగా మారింది. అభివృద్ధి నిధుల విషయంలో కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో (Punches) విరుచుకుపడ్డారు. దీంతో ఎలాంటి చర్చా జరుగకుండానే సమావేశం ముగిసింది. షామ్లీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నది.. రూ.4 కోట్ల మేర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన అంశంపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇద్దరు సభ్యుల మధ్య మాటామాటా పెరిగింది. ఎమ్మెల్యే, కౌన్సిల్ చైర్మన్ ఎదుటే బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. వారిని ఆపడానికి వెళ్లిన మరో సభ్యుడికి కూడా దెబ్బలు తప్పలేదు. దీంతో కొన్ని నిమిషాల్లో మున్సిపల్ కౌన్సిల్ కాస్తా రెజ్లింగ్ బౌట్గా మారిపోయింది. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.
కాగా, ఈ ఘటనపై మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. అభివృద్ధి ఏం జరగనప్పుడు రివ్యూ మీటింగ్ ఇంతకంటే ఏం చేస్తారు. బీజేపీ పాలన ద్వారా నేర్చుకున్నదిదే. ఇకపై సొంతంగా భద్రత ఏర్పాటుచేసుకుని సమావేశాలకు రావాల్సిందే అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో గొడవకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.
जब विकास कार्य हुए ही नहीं तो समीक्षा बैठक में और क्या होता, इसीलिए शामली में सभासदों के मध्य जमकर शारीरिक प्रहारों का आदान-प्रदान हुआ।
भाजपा राज का सबक : समीक्षा बैठक में अपनी सुरक्षा का प्रबंध स्वयं करके आएं। pic.twitter.com/9Fb8wBVwmh
— Akhilesh Yadav (@yadavakhilesh) December 28, 2023