న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బుధవారం సోనియాగాంధీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. గత 24 ఏండ్లలో గాంధీ కుటుంబేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ‘డరో మత్(భయపడొద్దు)’ అని కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు రాహుల్ నినాదాన్ని ప్రస్తావించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఖర్గే తొలిరోజే కీలక నిర్ణయం తీసుకొన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) స్థానంలో తాత్కాలికంగా ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సోనియా, రాహుల్తో పాటు 47 మంది సభ్యులుగా ఉన్నారు.
‘s as