తిరువనంతపురం: కేరళలోని మున్నార్లో ఇప్పుడు అరుదైన నీలకురింజి పుష్పాలు(Neelakurinji Flowers) పూశాయి. 12 ఏళ్లకు ఒకసారి ఆ అద్భుత పుష్పాలు దర్శనం ఇస్తుంటాయి. ఇక అందాలను తిలకించేందుకు మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అనూరాగ్ ఠాకూర్.. మున్నార్కు వెళ్లారు. తన సతీమణితో ఆయన ఆ ట్రిప్లో ఉన్నారు. నీలకురింజి పూలతోటల్లో దిగిన తాజా ఫోటోను ఆయన తన ఇన్స్టాలో అప్లోడ్ చేశారు.
కొరండ్కాడ్ కొండల్లో మళ్లీ నీలకురింజి పువ్వులు పూసినట్లు ఆయన తన ఇన్స్టాలో తెలిపారు. దేఖో అప్నా దేశ్ అన్న ట్యాగ్లైన్ను కూడా ఆయన పేర్కొన్నారు. విదేశీ పర్యటనలు కాదు, ముందుగా దేశాన్ని శోధించాలన్న కేంద్ర ప్రభుత్వ సందేశాన్ని ఆయన తన పోస్టులో వెల్లడించారు.