తిరువనంతపురం: కేరళకు చెందిన ఓ మహిళ(Kerala Woman)కు 40 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఆమెకు ఆరు నెలల కఠిన కారాగార శిక్షను కూడా విధించారు. ఏడేళ్ల కూతుర్ని రేప్ చేసే విధంగా లివిన్ పార్ట్నర్ను ప్రోత్సహించిన ఆ మహిళకు ఈ శిక్షను ఖరారు చేశారు. తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి ఆర్ రేఖ.. ఆ మహిళపై 20వేల జరిమానా కూడా వేశారు. ఒకవేళ ఆ ఫైన్ చెల్లించుకుంటే ఆమెకు అదనంగా మరో ఆరు నెలల శిక్ష పడే అవకాశం ఉన్నది.
2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్య కాలంలో ఏడేళ్ల అమ్మాయిపై లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. నిందిత మహిళ తన భర్తను వదిలేసి లవర్ శిశుపాలన్తో లివిన్ పార్ట్నర్గా జీవించింది. ఆమె ఏడేళ్ల కూతురు కూడా ఆ సమయంలో ఆ జంట వద్దే ఉన్నది. ఆ సమయంలోనే అమ్మాయిని శిశుపాలన్ రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. శిశుపాలన్ను ప్రోత్సహించినందుకు తల్లికి జైలుశిక్షను ఖరారు చేశారు.