తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలోని (Kalamassery) కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన మతపర కార్యక్రమంలో వరుస పేలుళ్లు (Kerala Blasts) సంభవించాయి. ఒకరు మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. అయితే కేరళతోపాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఈ పేలుళ్లకు తానే బాధ్యుడినని ఒక వ్యక్తి ప్రకటించాడు. డొమినిక్ మార్టిన్గా చెప్పుకున్న ఆ వ్యక్తి ఫేస్బుక్ లైవ్లో మాట్లాడాడు. ‘నా పేరు మార్టిన్. యెహోవా సాక్షుల బృందం నిర్వహించిన సమావేశంలో బాంబు పేలుడు సంభవించింది. ఫలితంగా భారీ విధ్వంసం జరిగింది. ఈ సంఘటనకు నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను. నేను ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డానో వివరించడానికి ఈ ఫేస్బుక్ లైవ్ నిర్వహిస్తున్నా’ అని అతడు తెలిపాడు.
కాగా, అనంతరం తొలగించిన ఆ ఫేస్బుక్ లైవ్లో మార్టిన్ మరిన్ని విషయాలు మాట్లాడాడు. ‘ఆరేళ్ల క్రితం ఈ సంస్థ తప్పు అని, దాని బోధనలు దేశ వ్యతిరేకమని నేను గ్రహించా. దీనిని వారి దృష్టికి తీసుకువెళ్లా. వారి మార్గాలను సరిదిద్దమని కోరా. అయినప్పటికీ వారు ఇంకా అలా చేయడాన్ని సహించలేకపోయా. వారు బోధించే వాటిని నేను వ్యతిరేకిస్తున్నా. ఈ సంస్థ ఈ సమాజానికి అవసరం లేదని నేను పూర్తి దృఢ నిశ్చయంతో చెబుతున్నా. వెంటనే పోలీస్ స్టేషన్లో లొంగిపోతా’ అని పేర్కొన్నాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఫేస్బుల్ లైవ్లో మాట్లాడిన డొమినిక్ మార్టిన్, త్రిసూర్లో పోలీసులకు లొంగిపోయిన పేలుళ్ల అనుమానితుడు 48 ఏళ్ల మార్టిన్ ఒకరేనా అన్నది స్పష్టం కాలేదు.
BREAKING: One man named Dominic Martin through a Facebook Video has taken responsibility for the Kerala bomb blasts. He has claimed he is part of the same Christian group which had organised the event. His claims are being verified by the Kerala Police. Joint investigation by NIA… pic.twitter.com/YvTje9G5uS
— Frontalforce 🇮🇳 (@FrontalForce) October 29, 2023
One man named Dominic Martin through a Facebook Video has taken responsibility for the Kerala bomb blasts. He has claimed he is part of the same Christian group which had organised the event. His claims are being verified by the Kerala Police. Joint investigation by NIA & Police. pic.twitter.com/AUXc6fOy1K
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 29, 2023