తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,996 కరోనా కేసులు, 84 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,01,796కు, మొత్తం మరణాల సంఖ్య 26,342కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 16,576 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 46,73,442కు చేరుకున్నదని, ప్రస్తుతం రాష్ట్రంలో 1,01,419 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతున్నది.