తిరువనంతపురం: కేరళలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 49,771 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,00,556కు, మొత్తం కేసుల సంఖ్య 57,74,857కు పెరిగింది. కాగా, గత 24 గంటల్లో 63 మంది కరోనాతో చనిపోయారు. అయితే కేంద్ర మార్గదర్శకాల మేరకు అదనంగా 77 మరణాలు కలిపారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 52,281కు చేరింది.
మరోవైపు బుధవారం 34,439 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య 54,21,307కు చేరింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,05,33,649 డోసుల టీకాలు వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.