తిరువనంతపురం: కేరళలో కరోనా వైరస్ ఇంకా ఉధృతంగానే ఉంది. ఇప్పటికీ 20 వేలకు దరిదాపుల్లోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజుల్లో అయితే ఏకంగా 30 వేలకు అటు ఇటుగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఉదయం 9 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కూడా 19,622 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 37,96,317కు చేరింది.
ఇక, కొత్తగా ఇవాళ 132 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 20,673కు పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 22,563 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. కరోనా బారి నుంచి కోలుకున్న వారు, మరణించిన వారు పోగా కేరళలో నమోదైన మొత్తం కేసులో ప్రస్తుతం 2,09,493 యాక్టివ్ కేసులు ఉన్నాయి.