తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. చాలాకాలంగా అక్కడ 30 వేల దరిదాపుల్లో కొత్త కేసులు నమోదయ్యేవి. గత రెండు రోజుల నుంచి వరుసగా 20 వేల లోపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటలలో కూడా 15,876 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,05,005 మంది శాంపిల్స్ను పరీక్షించగా వారిలో 15,876 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే పాజిటివిటీ రేటు 15.12గా నమోదయ్యింది.
కొత్తగా 25,654 మంది కరోనా బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఇక కరోనా మరణాలు కేరళలో ప్రతి రోజూ 100కు తగ్గకుండా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 129 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 22,779కి పెరిగింది. కేరళ ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది.