తిరువనంతపురం: కేరళలో మరో 9 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఎర్నాకులం చేరుకున్న 6 మందికి, తిరువనంతపురం చేరుకున్న 3 మందికి ఈ కొత్త వేరియంట్ కరోనా సోకింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. బ్రిటన్ నుంచి ఇద్దరు, టాంజానియా నుంచి ఒక మహిళ, ఒక బాలుడు, ఘనా నుంచి ఒక మహిళ, ఐర్లాండ్ నుంచి మరో మహిళ ఎర్నాకులం వచ్చినట్లు చెప్పారు. కరోనా పరీక్షలో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించినట్లు తెలిపారు. అలాగే నైజీరియా నుంచి తిరువనంతపురానికి వచ్చిన భార్య, భర్తతోపాటు మరో మహిళకు కొత్త వేరియంట్ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.