తిరువనంతపురం: కట్నం వేధింపులు తట్టుకోలేక గత ఏడాది కేరళకు చెందిన విస్మయా నాయర్ ఆత్మహత్య చేసుకున్నది. ఆ కేసులో కేరళ జిల్లా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. భర్త కిరణ్ కుమార్ను దోషిగా తేల్చిన కోర్టు అతనికి పదేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. వరకట్నం చట్టం ప్రకారం ఆ శిక్షను వేశారు. బంగారం, కానుకలు, వస్తువులు ఇవ్వాలంటూ విస్మయను వేధించినట్లు కోర్టు తేల్చింది. కుమార్కు వంద తులాల బంగారం, ఎకరం భూమి, కారును కట్నం కింద ఇచ్చేందుకు నాయర్ కుటుంబం అంగీకరించింది. కానీ అత్తవాళ్లు ఇచ్చిన కారుతో కుమార్ సంతృప్తిగా లేడు. దీంతో భార్య విస్మయను వేధించడం ప్రారంభించాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె బాత్రూమ్లో ఆత్మహత్యకు పాల్పడింది. 2020లో దేశంలో సుమారు పది వేల కట్నం వేధింపుల ఫిర్యాదులు నమోదు అయ్యాయి. మరో ఏడు వేల మరణాలు కూడా నమోదు అయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం తెలుస్తోంది.