తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభన కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 50,812 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం జిల్లాలో అత్యధికంగా 11,103 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 402 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా కరోనా బారినపడ్డారు. ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,36,202కు పెరిగింది. అయితే కేవలం 3.4 శాతం మంది మాత్రమే ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు.
కాగా, కేరళలో గత 24 గంటల్లో 8 కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే ఆలస్యంగా 86 మరణాలు వెలుగు చూడటంతోపాటు కేంద్ర మార్గదర్శకాల మేరకు మరో 311 మరణాలను కలిపారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 53,191కి చేరింది.
మరోవైపు కరోనా కేసుల విజృంభన నేపథ్యంలో లాక్డౌన్ పరిస్థితిని తలపించేలా ఆదివారం రోజున కఠిన ఆంక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. కేవలం నిత్యవసర వస్తువుల షాపులు, అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు.