కోజికోడ్: కేరళలో వైద్యుల నిర్లక్ష్యానికి(Medical Negligence) చెందిన కేసులో అక్కడి సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. హర్షినా అనే మహిళ కడుపులో కత్తెరలు వదిలివేసిన కేసులో డాక్టర్లను విచారించేందుకు ప్రభుత్వం పోలీసులకు అనుమతి ఇచ్చింది. 2017, నవంబర్ 30వ తేదీన కోజికోడ్ మెడికల్ కాలేజీలో ఆమెకు సీ-సెక్షన్ సర్జరీ జరిగింది. అయితే కొన్నాళ్లకు నొప్పి రావడంతో ఆమె ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. మూడవ డెలివరీ తర్వాత ఆమె కడుపులో ఆర్టరీ ఫోర్సెప్స్ ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆమె కోర్టులో వాదించింది. గైనకాజీ ప్రొఫెసర్ సీకే రమేశన్, గైనకాలజిస్ట్ ఎం సహానా, కోజికోడ్ మెడికల్ కాలేజీ నర్సులు రెహానా, కేజీ మంజూలపై కేసు నమోదు చేశారు.ఆ నలుగురిపై విచారణ చేపట్టేందుకు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవాళ అనుమతి ఇచ్చారు. రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే కేసుల ఆ నలుగురిపై నమోదు చేశారు. మరో రెండు రోజుల్లో కున్నమంగళం పోలీసు స్టేషన్లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో నష్టపరిహారం కోసం చివర వరకు పోరాడనున్నట్లు హర్షినా పేర్కొన్నది. కోజికోడ్ ఆస్పత్రి ముందు న్యాయం కోరుతూ దాదాపు 154 రోజుల పాటు హర్షినా ధర్నా చేపట్టింది. 50 లక్షల పరిహారం ఇచ్చే వరకు పోరాటం ఆగదన్నారు.