తిరువనంతపురం: నిధులు విడుదల చేయకుండా ఆర్థికంగా తమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేంద్రం వైఖరిపై కేరళ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్థికంగా రాష్ర్టాలను ఇబ్బందులకు గురిచేస్తూ కేంద్రం దేశ సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేస్తున్నదని ఆరోపిస్తూ కేరళ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
విపక్షం సభలో లేనప్పటికీ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించిందని అసెంబ్లీ స్పీకర్ షంషీర్ ప్రకటించారు. ఇటీవల కేంద్రం రాష్ట్ర రుణ పరిమితిని దారుణంగా తగ్గించిందని, రెవెన్యూ లోటు గ్రాంటునూ తగ్గించిందని కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ తెలిపారు.