తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) మరింత తీవ్రమవుతున్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య మరోసారి వేగంగా పెరిగిపోతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,238 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 52,76,417కు చేరింది. కొత్తగా ఇవాళ 44 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 49,591కి పెరిగింది.
ఇక గత 24 గంటల్లో 2,390 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దాంతో కేరళలో మొత్తం రికవరీల సంఖ్య 52,00,350కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 34,902 ఉన్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా కేరళలో భారీగానే జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 54,108 శాంపిళ్లను పరీక్షించారు. ప్రస్తుతం అక్కడ 14 జిల్లాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నది. అత్యధికంగా తిరువనంతపురంలో 1,507 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.