తిరువనంతపురం, ఆగస్టు 9: కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న అన్ని భాషల్లో కేరళ పేరును మార్చాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది.