తిరువనంతపురం: కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగిన బాప్టిజమ్ సెర్మనీలో ఫుడ్ పాయిజన్ కావడంతో వంద మంది అస్వస్థకు గురయ్యారు. జిల్లాలోని కీజ్వైపూర్ గ్రామంలో బాప్టిజం సెర్మనీ జరిగింది. దీనికి వంద మందికి పైగా హాజరయ్యారు. వారంతా వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. కార్యక్రమ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెర్మనీకి ఆహారం సరఫరా చేసిన క్యాటరింగ్ సంస్థపై పోలీసులు.. 268,272,269 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ ఘటనపై రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.