న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్ష పార్టీల మద్దతు కూడగడుతున్న అరవింద్ కేజ్రీవాల్ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను, శుక్రవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలిసి మద్దతు కోరనున్నారు.
ఆర్డినెన్స్పై కేజ్రీవాల్ పోరాటానికి మద్దతు ఇవ్వను: ఓవైసీ
ఢిల్లీలో అధికారుల పోస్టింగులకు సంబంధించి కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తాను మద్దతు ఇవ్వబోనని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీ స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు బీజేపీకి కేజ్రీవాల్ ఎందుకు మద్దతు ఇచ్చారని, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేజ్రీవాల్ కరుడుగట్టిన హిందూత్వవాదాన్ని ఆచరిస్తారని, అందుకే ఆయనకు మద్దతు ఇవ్వబోనని ఓవైసీ పేర్కొన్నారు.