న్యూఢిల్లీ: రైల్వే చార్జీల్లో సీనియర్ సిటిజన్లకు(వృద్ధులు) రాయితీలను పునరుద్ధరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. వృద్ధులకు రాయితీని వర్తింపజేస్తే రూ.1,600 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్రమే లోక్సభలో చెప్పిందని, రూ.45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం ఈ మాత్రం ఇవ్వలేదా అని ప్రశ్నించారు.
ఈ వ్యయ మొత్తం సముద్రంలో ఒక చుక్క వంటిదని, వృద్ధులను ఇబ్బంది పెడుతూ, ఈ ఖర్చు చేయకపోవడం వల్ల ప్రభుత్వమేమీ సంపన్నం లేదా పేద అయిపోదు కదా! అని కేంద్రం తీరును విమర్శించారు.