న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: కేదార్నాథ్లోని సుప్రసిద్ధ ఆలయం లోపలి భాగంలో బంగారు రేకుల తాపడం చేయడాన్ని పూజారుల్లోని ఒక వర్గం వ్యతిరేకిస్తున్నది. అలా చేయడం శతాబ్దాల సంప్రదాయాల్లో వేలు పెట్టడమే అవుతుందని నిరసనలు చేపడుతున్నారు. గుడి లోపలి గోడలకు బంగారు తాపడం చేయించేందుకు మహారాష్ట్రకు చెందిన భక్తుడు ముందు కు వచ్చాడు. అయితే, బంగారు రేకులను అమర్చడానికి ఆలయ కుడ్యాలను భారీ యంత్రాలతో తూట్లు పొడవాల్సి వస్తుందని, ఇది సరికాదని కొందరు పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.