కౌన్ బనేగా కరోడ్ పతి..అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రాం 2022 ఎపిసోడ్ త్వరలో ప్రారంభం కానుంది. కాగా, ఇందుకు సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో అమితాబ్ బచ్చన్.. కంటెస్టెంట్ సీట్లో కూర్చొన్న మహిళను 2016లో చక్కర్లు కొట్టిన రూ. 2వేల నోట్కు సంబంధించిన పుకారుపై ప్రశ్న అడిగాడు. ఆమె చెప్పిన సమాధానం విని అమితాబ్ బచ్చన్తోపాటు అంతా ఆశ్చర్యపోయారు.
ఈ వీడియోలో కౌన్ బనేగా కరోడ్పతి సెటప్లో హోస్ట్ అమితాబ్ బచ్చన్ ఎదుట కంటెస్టెంట్ కూర్చున్నది. అమితాబ్ బచ్చన్ ఆమెను ఒక ప్రశ్న అడిగాడు. వీటిలో ఏది జీపీఎస్ టెక్నాలజీని కలిగి ఉన్నది?.. టైప్ రైటర్, టెలివిజన్, శాటిలైట్, రూ. 2000 నోటు అనే ఆప్షన్లు ఇచ్చాడు. కంటెస్టెంట్ చిరునవ్వుతో రూ. 2వేల నోటు అని సమాధానం చెప్పింది. ‘కచ్చితంగా అదే ఆప్షన్ ఆ?’ అని అమితాబ్ అడగ్గా.. ‘అవును సార్ ఈ ఆన్సర్ నాకే కాదు..యావత్ దేశానికి తెలుసు’ అని ఆమె అంటుంది. అనంతరం అమితాబ్ బచ్చన్ ఆ సమాధానం తప్పు అని, శాటిలైట్ కరెక్ట్ ఆన్సర్ అని చెబుతాడు.
వెంటనే ఆ కంటెస్టెంట్ సార్ మీరు జోక్ చేయట్లేదుగదా అని అనగా, ‘నేనెందుకు జోక్ చేస్తాను..జోక్ను మీరు నిజమని నమ్మార’ని అమితాబ్ అన్నారు. జీపీఎస్ చిప్ ఉన్న రెండు వేల రూపాయల నోట్ల వార్తలు టీవీల్లో వచ్చాయని, అలా తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. టీవీలు, సోషల్మీడియాలో వచ్చే వార్తలను ఫ్యాక్ట్ చెక్ చేయకుండా నమ్మొద్దని, చూడండి అలా నమ్మడం వల్లే తన కంటెస్టెంట్ గేమ్ ఓడిపోయిందని అమితాబ్ చెబుతాడు. ఎవరు ఏది చెప్పినా వినండి.. కాని దాన్ని ఒక్కసారి చెక్ చేసుకున్నాకే నమ్మండి అని ఈ వీడియోకు ట్యాగ్లైన్ ఇచ్చారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
We all know that one person jo humein aisi unverified sansani khabrein sunata hai! Tag them in the comments and tell them that “Gyaan jahaan se mile bator lo, lekin pehle tatol lo.”#KBC2022 coming soon! Stay tuned!@SrBachchan pic.twitter.com/Y2DgAyP3MH
— sonytv (@SonyTV) June 11, 2022