బెంగళూరు: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఒక యువతిని క్రేన్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. దీంతో స్థానికులు నిరసనకు దిగారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. వైట్ఫీల్డ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల నూర్ పిజా, శుక్రవారం కాలేజీ విడిచిన తర్వాత నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నది. అయితే వెనుక వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన క్రేన్ ఆ యువతిని ఢీకొట్టింది. దాని కింద నలిగిపోయిన ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆ యువతిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు. రోడ్డు ఆక్రమణలు, క్రేన్ వంటి భారీ వాహనాలను అనుమతించడం, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వంటి సమస్యలపై గళమెత్తారు. నూర్ పిజా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫ్లకార్డులతో శనివారం నిరసన తెలిపారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాద సంఘటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Warning: Disturbing visuals.
19-year-old succumbs to injuries after construction crane mows her down. Visuals of horrific incident in Bengaluru's Whitefield locality caught on camera. pic.twitter.com/MOW9YYUntl
— South First (@TheSouthfirst) November 5, 2022