బెంగళూర్ : సీనియర్ కాంగ్రెస్ నేత, కర్నాటక మాజీ సీఎం ఎస్ సిద్ధరామయ్యపై బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ నళిన్ కుమార్ కతీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య ఓ టెర్రరిస్టని, కాంగ్రెస్ పార్టీలో దుర్భలమైన పరిస్ధితిలో ఉన్నందునే ఆయన అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలను తాలిబన్లు, హిట్లర్ వారసులుగా సిద్ధరామయ్య అభివర్ణించిన నేపధ్యంలో ఆయనపై కతీల్ విరుచుకుపడ్డారు.
సిద్ధరాయమ్య హయాంలో కర్నాటకలో పెద్దసంఖ్యలో హత్యలు జరిగాయని, ఆయనే అసలైన తాలిబన్ సంస్కృతిని పుణికిపుచ్చుకున్నాడని విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విమర్శలపై కర్నాటక సీఎం దీటుగా బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బానిసల భావజాలం కలిగినదని, తమ పార్టీ దేశభక్తి కలిగిన పార్టీ అని సీఎం బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు.