అహ్మదాబాద్: డ్రగ్స్ కేసులో ఇటీవల గుజరాత్ తీరంలో అరెస్టయిన ఆరుగురు పాకిస్థానీయుల్లో కరాచీ డ్రగ్స్ మాఫియా డాన్ హజి హసన్ కుమారుడు సాజిద్ కూడా ఉన్నట్టు తేలింది. ఆరుగురి గుర్తింపు కార్డులు పరిశీలించగా.. ఈ విషయం వెల్లడైందని ఇండియా టుడే పేర్కొన్నది. ఈ నెల 19న రూ.400 కోట్ల విలువైన 77 కేజీల హెరాయిన్ను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ అంతా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్కు తరలించేందుకు నిందితులు ప్లాన్ వేశారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.