కీలక పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ రాజీనామా చేసేశారు. మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత పదవికి కమల్నాథ్ హఠాత్తుగా రాజీనామా చేసేశారు. అయితే.. ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికి ఎలాంటి ప్రకటన రాలేదు. తన రాజీనామా లేఖను హైకమాండ్కు పంపించారు. హైకమాండ్ ఈ రాజీనామాను ఆమోదించింది. ఇక.. కమల్నాథ్ స్థానంలో డాక్టర్ గోవింద్ సింగ్ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఇకపై మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేతగా గోవింద్ సింగ్ కొనసాగనున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలే రాజీనామాకు కారణమా?
కొన్ని రోజులుగా కమల్నాథ్ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. బీజేపీ చెప్పే బక్వాస్ మాటలు వినడానికి తాను అసెంబ్లీకి వెళ్లనంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కమల్నాథ్పై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ స్పీకర్ను కోరింది. ఈ వ్యాఖ్యలే ఆయన రాజీనామాకు కారణమయ్యాయా? అంటూ పార్టీలో చర్చ జరుగుతోంది.
ఒక్కరికి ఒకే పదవి.. అన్న ఫార్ములా?
మధ్యప్రదేశ్ పీసీసీ విషయంలో హైకమాండ్ కొన్ని రోజులు క్రితం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క వ్యక్తికి ఒకే పదవి అన్న సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది. ఈ కారణంగానే కమల్నాథ్ రాజీనామా చేశారన్నది ఆయన వర్గం వాదన. ఇన్ని రోజుల పాటు ప్రతిపక్ష నేతగా సేవలందించినందుకు అధిష్ఠానం కమల్నాథ్కు ధన్యవాదాలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.