న్యూఢిల్లీ, ఆగస్టు 22: జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్పర్సన్గా జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఈయన బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీవాస్తవ గతంలో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ పదవీ విరమణ అనంతరం గత నెల 6న జస్టిస్ షియో కుమార్ సింగ్ను తాత్కాలిక చైర్మన్గా కేంద్రం నియమించింది. ఆయన స్థానంలో తాజాగా శ్రీవాస్తవకు బాధ్యతలు అప్పగించింది.