న్యూఢిల్లీ, డిసెంబర్ 12: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా బాధ్యతలు స్వీకరించారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు. మాజీ సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని కొలీజియం గత ఏడాది సెప్టెంబర్లో జస్టిస్ దీపాంకర్ను సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సు చేసింది. జస్టిస్ దీపాంకర్ పదవీకాలం 2030 ఫిబ్రవరి 8 వరకు ఉంటుంది. ఇంతకాలం ఆయన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా నుంచి ఆయన 1989లో లా డిగ్రీ పొందారు. ఆయన తండ్రి సలీల్ కుమార్ కలకత్తా హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జిగా పని చేశారు. 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన సుప్రీం కోర్టులో జస్టిస్ దీపాంకర్ దత్తాతో కలిపి ప్రస్తుతం 28 మంది ఉన్నారు.