న్యూఢిల్లీ: త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీ అమర్నాథ్ గౌడ్ బుధవారం నియమితులయ్యారు. ప్రస్తుత సీజేగా ఉన్న ఇంద్రజిత్ మహంతి గురువారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ అమర్నాథ్ గౌడ్ ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను ఈనెల 11న స్వీకరించనున్నారు. తెలంగాణకు చెందిన జస్టిస్ అమర్నాథ్ గౌడ్ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా 2017 నుంచి 2021 వరకు నాలుగేండ్లు పనిచేశారు. ఆ తర్వాత 2021, అక్టోబర్లో త్రిపుర హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.