లక్నో, మార్చి 29: యూపీలో గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బందా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుక్రవారం న్యాయ విచారణకు ఆదేశించారు. నెలలోగా తమకు నివేదిక ఇవ్వాలని కోరారు.
జిల్లా జైలులో ఉన్న 63 ఏండ్ల ముఖ్తార్ అన్సారీ గురువారం రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి తీసుకురాగా, గుండెపోటుతో మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా, తన సోదరుడు ముఖ్తార్కు స్లో పాయిజన్ ఇచ్చి చంపారని ఆయన సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు.