న్యూఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ ( Johnson & Johnson ) ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకున్నది. 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిచేంందుకు జాన్సన్ కంపెనీ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ఓ ప్రకటన చేసింది. మంగళవారమే తమ దరఖాస్తును ప్రభుత్వానికి అందజేసినట్లు అమెరికా సంస్థ పేర్కొన్నది. కరోనా టీకా అందరికీ అందాలని, వీలైనంత త్వరగా చిన్నారులకు కూడా కోవిడ్ టీకా అందేలా చూడాలని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తన ప్రకటనలో చెప్పింది. ఇప్పటికే చిన్నారుల టీకాలకు యురోపియన్ ఏజెన్సీ అనుమతి క్కింది. భారతీయ ఔషధ నియంత్రణ సంస్థ కూడా సింగిల్ డోసు జాన్సన్ టీకాకు ఓకే చెప్పింది. దీని కోసం హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థతో ఆ ఫార్మా కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది.