లాతెహర్: జార్ఖండ్లో రైల్వే ట్రాక్ల పేల్చివేత మావోయిస్టుల పనేనని అక్కడి పోలీసులు తేల్చారు. ఈ అర్ధరాత్రి (తెల్లవారితే శనివారం) 12.30 గంటలకు ధన్బాద్ డివిజన్లోని DEMU రైల్వేస్టేషన్-రిచుగుట్ట రైల్వేస్టేషన్ల మధ్య అప్ అండ్ డౌన్ రెండు రైల్వే ట్రాక్లను బాంబులు పెట్టి పేల్చారు. అయితే, ఈ ఘటన మావోయిస్టుల పనేనని ఆర్పీఎఫ్ సీనియర్ కమాండెంట్ హేమంత్ కుమార్ చెప్పారు.
కాగా, ఆర్పీఎఫ్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పనులను పునరుద్ధిరించారు. దాంతో ఎలాంటి అంతరాయం లేకుండా రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. సీపీఐ మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా, ఆయన సతీమణి శీలా మరాండి విడుదలకు డిమాండ్ చేస్తూ మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపునిచ్చారని, అందులో భాగంగానే ఇవాళ రైల్వే ట్రాక్ను పేల్చివేశారని పోలీసులు తెలిపారు.