న్యూఢిల్లీ, జూలై 26: జేఈఈ-అడ్వాన్స్డ్ను అక్టోబర్ 3న నిర్వహిస్తామని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పరీక్షను నిర్వహిస్తామని ప్రధాన్ ట్విటర్లో పేర్కొన్నారు. జూలై 3న నిర్వహించాల్సిన పరీక్షను కరోనా దృష్ట్యా వాయిదా వేశారు. ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన ఈ పరీక్షను ఈ ఏడాది ఐఐటీ-ఖరగ్పూర్ నిర్వహిస్తున్నది.