న్యూఢిల్లీ : జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ గురువారం విడుదలైంది. గువాహటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ షెడ్యూల్ను ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను వచ్చే ఏడాది జూన్ 4న నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 30న రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపింది. అభ్యర్థులు మే 5వ తేదీలో ఫీజు చెల్లించాలని పేర్కొంది. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. పూర్తి వివరాలకు jeeadv.ac.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించింది.