న్యూఢిల్లీ, ఆగస్టు 31: రైల్వే బోర్డు చైర్పర్సన్, సీఈవోగా జయ వర్మ సిన్హా నియమితులయ్యారు. దీంతో ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 1988లో రైల్వేలో చేరిన జయ వర్మ ఉత్తర, తూర్పు, ఆగ్నేయ రైల్వే జోన్లలో పనిచేశారు. ఒడిశా రైలు ప్రమాదం జరిగినప్పుడు ఇటు మీడియాకు, అటు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా కీలకపాత్ర పోషించారు.