న్యూఢిల్లీ: భారతదేశం జనవరి 16ను ‘నేషనల్ స్టార్టప్ డే (జాతీయ స్టార్టప్ దినోత్సవం)’గా జరుపుకోబోతున్నదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. స్టార్టప్ల కల్చర్ దేశ నలుమూలలకు విస్తరించేలా చేయడం కోసం జనవరి 16ను నేషనల్ స్టార్టప్ డేగా నిర్వహించుకోవాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. దేశంలోని 150 స్టార్టప్ల ప్రతినిధులతో ప్రధాని మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. 2022 స్టార్టప్ల రంగానికి మరిన్ని అవకాశాలు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసారి స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ కూడా జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ దశాబ్దంలో ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్షిప్, స్టార్టప్ ఎకోసిస్టమ్కు సంబంధించి తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు.
అగ్రికల్చర్, ఆరోగ్యం, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్, స్పేస్, ఇండస్ట్రీ 4.0, సెక్యూరిటీ, ఫిన్టెక్, ఎన్విరాన్మెంట్ తదితర రంగాలకు చెందిన స్టార్టప్ల ప్రతినిధులు ఇవాళ్టి సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 150 స్టార్టప్లకు చెందని ప్రతినిధులు ఈ ఇంటరాక్షన్కు హాజరయ్యారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.