జమ్ము: జమ్ముకశ్మీరులోని పూంఛ్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. సైనిక వాహనాలపై ఆకస్మికంగా కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వారిని తిప్పికొట్టారు. క్యాంప్నకు తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. కాల్పుల్లో సైనికులు ఎవరూ గాయపడలేదు. ఉగ్రవాదుల కోసం సైన్యం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పూంఛ్ సెక్టర్లోని కృష్ణ ఘాటి వద్ద ఈ దాడి జరిగినట్లు భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ట్వీట్చేసింది. ఇటీవల పూంఛ్ జిల్లాలో సైనిక వాహనంపై ముష్కరులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మూడు వారాల వ్యవధిలో ఉగ్రదాడి జరుగడం ఇది రెండోసారి.